ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో తారకరత్న పెద్ద కర్మ..వెల్ విషర్లుగా బాలయ్య, విజయసాయి

నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18 న కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు మృతువు తో పోరాడిన తారకరత్న ..చివరికి మృతువు నుండి బయటపడలేకపోయారు. తారకరత్న మృతి తో నందమూరి ఫ్యామిలీ తో పాటు టిడిపి శ్రేణుల్లో విషాదం నెలకొంది. ఇక తారకరత్న పెద్ద కర్మ కార్యక్రమం మార్చి 2వ తేదీన హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించిన కార్డును కుటుంబ సభ్యులు ప్రింట్ చేయించారు. కార్డుపై వెల్ విషర్స్ గా బాలకృష్ణ, వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్లను వేశారు.

ఇక తారకరత్న అంటే బాలకృష్ణ కు ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు. తారకరత్న గుండెపోటుకు గురైన దగ్గరి నుండి అన్ని తానై చూసుకుంటూ వచ్చారు.అలాగే విజయసాయిరెడ్డి తారకరత్న భార్య బంధువు అనే సంగతి తెలిసిందే. దీంతో, ఆయన కూడా రాజకీయ విభేదాలను పక్కన పెట్టి పెద్దరికాన్ని ప్రదర్శించారు. చంద్రబాబు, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, ఇతర కుటుంబసభ్యులతో ఒక బంధువులా కలిసి పోయారు. విజయసాయి వ్యవహరించిన తీరును చాలా మంది హర్షించారు. అందుకే వీరిద్దరి పేర్లను కార్డ్స్ ఫై వెల్ విషర్స్ గా ప్రింట్ చేయించారు.