లాక్ డౌన్ ను పర్యవేక్షించిన ఎమ్మెల్యే
ప్రజలు బయటికి రావద్దని విజ్ఞప్తి
Tanuku: కరోనా కర్ఫ్యూ నేపధ్యంలో ఉన్న లాక్ డౌన్ ని ఆదివారం నాడు తణుకులో పూర్తిగా నిర్వహించారు.
వారం రోజుల ముందు నుండే ప్రకటించడంతో లాక్ డౌన్ సంపూర్ణంగా జరిగింది.
ఉదయం నుండి తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర రావు బైక్ పై తిరుగుతూ పర్యవేక్షించారు.
అక్కడక్కడ కనిపించిన వారిని ఆపి మరీ వారించారు.
లాక్ డౌన్ నిర్వహించిన నాటి నుండి ప్రతీరోజు మున్సిపల్ కార్యాలయంలో నిర్వస్తున్న సమీక్షాసమావేశాన్ని కూడా ఎమ్మెల్యే కారుమూరి వాయిదా వేశారు. తణకు బైపాస్ రోడ్డ్ లో బోజనాల పంపిణీ చేశారు.
ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత కూడా పాటించాలని ఎమ్మెల్యే కోరారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/