ప్రతిపక్షాలకు ధీటైన సమధానం చెబుతాం
ఆస్తులను కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు జానాల్ని రెచ్చగొట్టి ఉద్యమం చేయిస్తున్నారు
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసే పోరాటాలకు దీటైన సమాధానం చెబుతామని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులపై ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి ఉత్తరాంధ్ర ఫోరం అండగా ఉంటుందని స్పీకర్ స్పష్టం చేశారు. కాగా ఇన్సైడ్ ట్రేడింగ్ను ఆస్తులను కాపాడుకునేందుకు చంద్రబాబు నాయుడు జనాల్ని రెచ్చగొట్టి ఉద్యమం చేయిస్తున్నారని స్పీకర్ దుయ్యబట్టారు. అమరావతిలో సాగేది సహజసిద్దమైన పోరాటం కాదని అసలైన ప్రజా ఉద్యమం అంటే ఏంటో చంద్రబాబుకు చూపిస్తామని హెచ్చరించారు. శ్రీకాకుళం నుంచి రాయలసీమకు వరకూ సాగే ఉద్యమం ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు చూస్తారని అన్నారు. ఇంకా మా పేదరికంతో, ఆకలి మంటలతో ఆడుకోవద్దని చంద్రబాబు నాయుడుని తమ్మినేని సీతారాం హెచ్చరించారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/