భారీ పేలుడు..9 మంది మృతి

firecracker-factory-blast

చెన్నై: తమిళనాడులోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరిగింది. ఈప్రమాదంలో అక్క‌డిక‌క్క‌డే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కడలూరు జిల్లా కట్టుమన్నార్ కోయిల్ తాలుకా కూరుంకుడి గ్రామంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఫ్యాక్టరీ యజమాని, ఆమె కూతురు కూడా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో బాణసంచా ఫ్యాక్టరీలో 15 మంది మహిళలు పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/