దేశంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు..తాలిబన్ల కీలక నిర్ణయం

ఆయుధాలను వెంట ఉంచుకునేందుకు వ్యాపారులకు అనుమతి


కాబుల్: తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతిభద్రతలు రోజురోజుకు దిగజారుతుండడంతో ప్రజల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. మరీ ముఖ్యంగా దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో వ్యాపారులపై దాడులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

వ్యాపారులు తమ స్వీయ రక్షణ కోసం ఆయుధాలను వెంట తీసుకెళ్లొచ్చని ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆయా సాంకేతిక సమస్యల పరిష్కారం అనంతరం ఈ నిర్ణయం అమలు చేయనున్నట్టు తెలిపింది. వ్యాపారులు, పెట్టుబడిదారుల భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని ఆ శాఖ అధికార ప్రతినిధి సయీద్ ఖోస్టాయ్ తెలిపారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/