తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు

న్యూఢిల్లీ: తాజ్‌ మహల్‌కు గురువారం బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీస్‌ అధికారులు తాజ్‌ మహల్‌ రెండు ద్వారాలను మూసివేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌లో పోలీస్‌లకు ఫోన్‌ చేసి ప్రేమసౌధంలో పేలుడు పదార్థాలు ఉంచినట్లు సమాచారం అందించాడు. బాంబు బెదిరింపు నేపథ్యంలో తాజ్‌ మహల్‌లో సీఐఎస్‌ఎఫ్‌, స్థానిక బలగాలను మోహరించారు. బాంబ్‌ స్క్వాడ్స్‌, డాగ్‌ స్క్వాడ్స్‌తో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. తాజ్‌ మహల్‌ను వీక్షించేందుకు వచ్చిన వారిని బయటకు తరలించారు. ఒక్కసారిగా బాంబు బెదింపు రావడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎవరు ఫోన్‌ చేశారు.. ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/