తైవాన్‌లో భారీ భూకంపం.. రెండు సార్లు కంపించిన భూమి

తైపీ: బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. తైపీలో స్వల్ప వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది. రిక్టర్‌స్కేలు వీటి తీవ్రత 6.6గా నమోదయింది. భూమి అంతర్భాగంలో 30.6 కిలోమీటర్ల లోతులో, మరొకటి 19.3 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. భూకంప కేంద్రాలు హువాలియన్‌ కౌంటీలో, టైటుంగ్‌ నగరానికి సమీపంలో ఉన్నాయని తెలిపింది. భూకంప ప్రభావం తైవాన్‌ అంతటా ఉన్నదని, కొద్ది సెకన్ల పాటు భవనాలు ఊగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు.

కాగా, హువాలియన్, టైటుంగ్ రెండూ పర్వత ప్రాంతాలు కావడంతో జనాభా తక్కువగా ఉంటారని, దీంతో ప్రమాద తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/