షేక్‌పేట తహసీల్దార్‌ సుజాత భర్త ఆత్మహత్య

కొన్ని రోజులుగా ఏసీబీ విచారణ ఎదుర్కొంటోన్న సుజాత

suside
suside

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని షేక్‌పేట తహసీల్దార్‌ సుజాత భర్త అజయ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు తెల్లవారు జామున ఆయన ఇంటిపై నుంచి  దూకి ‌ ప్రాణాలు తీసుకున్నాడు. అజయ్‌కుమార్‌ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు. కాగా ఇటీవలే షేక్‌పేట తహసీల్దార్‌ సుజాత ఏసీబీకి పట్టుబడ్డారు.  దీంతో సుజాత ఇంట్లో జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది. ఆమె ఇంట్లో మూడు బ్యాగుల్లో రూ.24.9 లక్షల నగదుతో పాటు అరకిలో బంగారం, ఆస్తుల పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విషయంలో సుజాతతో పాటు ఆమె భర్త అజయ్‌ను అధికారులు ప్రశ్నించగా వారిద్దరు భిన్నమైన వివరణలు ఇచ్చారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/