మోడీ స్పీచ్ ఫై టి కాంగ్రెస్ నేతల కామెంట్స్

మోడీ స్పీచ్ ఫై టిఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోడీ తన ప్రసంగంలో ఎక్కడ కూడా టిఆర్ ఎస్ పార్టీ ని విమర్శించడం కానీ , కేసీఆర్ పేరును ఎత్తడం కానీ చేయలేదు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏంచేసింది..ఎన్ని నిధులు అందజేసింది..కరోనా సమయంలో ఏంచేసిందనేది లెక్కలతో సహా మోడీ తెలిపారు. అయితే మోడీ స్పీచ్ ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ స్పందించారు.

తెలంగాణ మిత్రులారా… తన చీకటి మిత్రుడు కేసీఆర్ పేరు కూడా ప్రస్తావించకుండా కుటుంబపాలన, అవినీతి ఊసెత్తకుండా మోదీ గారి మిత్రధర్మం చూశారుగా…! అంటూ ట్వీట్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ భాయిభాయి అంటూ విమర్శించారు. కేసీఆర్ కు మోడీనే అధిష్ఠానం అని అన్నారు. ఇక టిఆర్ఎస్ ఫై గల్లీ లీడర్లే మాట్లాడతారు..మోడీ మాట్లాడారని జగ్గారెడ్డి అన్నారు. దేశానికి ఏమిచ్చారో తెలిపారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఏంచేసారో తెలపలేదని అన్నారు. సింగిల్ ఇంజన్ తోనే ఏంచేయలేదు. ఇక డబుల్ ఇంజనా అని జగ్గారెడ్డి ఎద్దేవా చేసారు. మరో కాంగ్రెస్ నేత భట్టి సైతం మోడీ ప్రసంగం ఫై నిప్పులు చెరిగారు.