భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీః భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేయించారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రపతిగా సంతకం చేశారు. భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ము.. పార్లమెంట్లో తొలి ప్రసంగం చేస్తున్నారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి రాంనాథ్ కోవింద్, వెంకయ్యనాయుడుతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర దేశాల నేతలు హాజరయ్యారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/