విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై స్వరూపానందేంద్ర స్వామి
ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరంకానివ్వబోమని స్పష్టం
Swaroopanandendra sarawati swamy
విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి కూడా కేంద్ర ప్రభుత్వ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ ఆర్కే బీచ్ వద్ద టి.సుబ్బరామిరెడ్డి శ్రీ లలితా కళా పీఠం ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనికి స్వరూపానందేంద్ర స్వామి, స్వాత్మనందేంద్ర స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వరూపానంద మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం అన్యాయమని అన్నారు. తెలుగువారంతా దీన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్ పరంకానివ్వబోమని అన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/