అనారోగ్యంతో ప్రబోధానంద కన్నుమూత

ఆశ్రమం నుంచి ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూత

Swamy prabodhananda died due to illness

అనంతపురం: తాడిపత్రిలో అనారోగ్యంతో ప్రబోధానంద కన్నుమూశారు. ఆశ్రమం నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రబోధానంద మృతి చెందారు. 1950లో తాడిపత్రి మండలంలోని అమ్మలదిన్నె కొత్తపల్లె అనే గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన అసలు పేరు పెద్దన్న చౌదరి. తొలుత భారత సైన్యంలో వైర్ లెస్ ఆపరేటర్ గా ఆయన పని చేశారు. సైన్యం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాడిపత్రిలో కొన్ని రోజులు ఆర్ఎంపీ డాక్టర్ గా సేవలందించారు. వైద్యుడిగా సేవలందిస్తూనే ఆయుర్వేదంపై పుస్తకాన్ని రచించారు. ఇదే సమయంలో ఆథ్యాత్మిక అంశాలపై కూడా గ్రంథాలను రచించారు. అనంతరం ఆథ్యాత్మిక గురువుగా మారారు. తాడిపత్రి సమీపంలోని చిన్నపొడమల గ్రామంలో శ్రీకృష్ణమందిరం పేరుతో ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఈయన త్రైత సిద్ధాంతాన్ని బోధించేవారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ లలో ఉన్న దైవజ్ఞానం ఒక్కటేననేదే ఈ సిద్ధాంతం. ఆధ్మాత్మిక భావనలను వివరిస్తూ ప్రబోధానంద అనేక పుస్తకాలు రాశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/