30 వరకు ఏపి హైకోర్టులో న్యాయపరమైన సేవలు బంద్
అమరావతి: ఏపిలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపి హైకోర్టు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ యూనిట్ విజయవాడలకు సంబంధించి న్యాయపరమైన, పరిపాలన పరమైన పనులను జూన్ 29, 30 తేదీల్లో రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ, మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జెస్ యూనిట్ విజయవాడకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని హైకోర్టు రిజిస్టర్ జనరల్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/