కాసేపట్లో అంత్యక్రియలు : పాడెపై నిద్రలేచిన కరోనా బామ్మ
మహారాష్ట్ర బారామతి జిల్లాలో ఘటన
మహారాష్ట్రలో జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కరోనా తో మృతిచెందిందని అందరూ భావించిన 75 ఏళ్ల బామ్మను పాడె పై ఉంచగా కాసేపటికి ఆ బామ్మ నిద్ర లేచి కూర్చుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర బారామతి జిల్లాలోని ఓ గ్రామంలో శకుంతల గైక్వాడ్ ఇటీవల కరోనా బారిన పడింది. అయితే ఆమె ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఇంట్లో రెడీ అయ్యారు. కానీ ఆ సమయంలో శరీరంలో ఎటువండి కదలికలు వారికి కనిపించలేదట. దీంతో బామ్మ చనిపోయిందనుకుని అంత్యక్రియలు చేస్తుండగా… ఆమె ఒక్కసారిగా లేచి కూర్చుందట. దీనితో అందరూ ఒక్కసారిగా భయపడ్డారట. అనంతరం ఆమెకు చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/