అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన సురేశ్ రైనా
ముంబయిః టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో అతడు ఐపీఎల్కు కూడా వీడ్కోలు పలికినట్లు అయింది. “ఇన్నేళ్ల పాటు ఈ దేశానికి, నా రాష్ట్రం ఉత్తరప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నా. క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నా. నా సామర్థ్యాలపై విశ్వాసం ఉంచి నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన బీసీసీఐ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్, చెన్నై టీం, రాజీవ్ శుక్లా సర్, నా అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా” అని రైనా సోషల్మీడియాలో రాసుకొచ్చాడు. కాగా, 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రైనా రిటైర్ అయిన విషయం తెలిసిందే. రైనా 226 వన్డేల్లో 5615 రన్స్, 78 టీ20ల్లో 1605 రన్స్ చేశాడు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/