దుబాయ్ లో ఫుల్ గా ఎంజాయ్!

సీనియర్ ఆర్టిస్ట్..సురేఖ వాణి సినిమా ప్రేక్షకులనే కాదు సోషల్ మీడియా ఫ్యాన్స్ ను కూడా విపరీతంగా అలరిస్తుంటుంది. నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అందాల ఆరబోత చేస్తూ నెటిజన్లను , ఫాలోయర్స్ ను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ భామ దుబాయ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. అక్కడ తాను గడిపే ప్రతి క్షణాన్ని మీడియా లో షేర్ చేస్తూ వస్తుంది. అయితే ఆమె ఎక్కడికి వెళ్లిన ఆమె వెంట తన కూతుర్ని వెంట పెట్టుకొని వెళ్ళేది. కానీ ఈసారి మాత్రం ఒక్కతే వెళ్ళింది. దీనికి కారణం ఏంటో మరి.

తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటో లో మద్యం బాటిల్ కనిపించడం తో ఆ పిక్ వైరల్ గా మారింది. మద్యం బాటిల్ తో తన హోటల్‌లో రిలాక్స్ అవుతూ ఉన్నట్టు కనిపించింది. ఇంత కంటే ఆనందం, ఇంత కంటే మంచి అనుభూతి ఇంకా ఎక్కడ ఉంటుంది అని చెప్పుకొచ్చింది. మందు బాటిల్, గ్లాసు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. గత ఏడాది కూడా ఇలానే బాత్ టబ్ పక్కన.. షాంపైన్ బాటిల్‌తో సురేఖా వాణి కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.