ఏప్రిల్ 4 నుంచి సుప్రీంకోర్టులో ప్ర‌త్య‌క్ష‌ విచార‌ణ‌లు

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఏప్రిల్ 4వ తేదీ (సోమ‌వారం) నుంచి కేసుల విచార‌ణ భౌతికంగా జ‌ర‌గ‌నున్న‌ట్లు సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ తెలిపారు. సోమ‌వారం నుంచి కోర్టును పూర్తిగా ఓపెన్ చేస్తున్నామ‌ని, ప్ర‌త్య‌క్షంగా కేసుల విచార‌ణ జ‌రుపుతామ‌ని, ఒక‌వేళ వ‌ర్చువ‌ల్ విచార‌ణ కావాల‌ని కోరితే, వారి కోసం సోమ‌వారం, శుక్ర‌వారం కేటాయించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. సుప్రీం బెంచ్ తీసుకున్న‌ట్లు నిర్ణ‌యం ప‌ట్ల బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు వికాశ్ సింగ్ థ్యాంక్స్ తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ అల‌జ‌డి నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 3వ తేదీ నుంచి సుప్రీంలో వ‌ర్చువ‌ల్ విచార‌ణ‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/