సుప్రీంలో పౌరసత్వ బిల్లు పై అభ్యంతరాల విచారణ

బిల్లును వ్యతిరేకిస్తూ మొత్తం 143 పిటిషన్లు

supreme court
supreme court

సున్యూఢిల్లీ: సుప్రీం కోర్టు నేడు పౌరసత్వ బిలుపై దాఖలైన అభ్యంతరాల పిటిషన్లను పరిశీలిం చనుంది. భారత ప్రభుత్వం పౌరసత్వ చట్టానికి సవరణలు చేసి ఆమోదించిన బిల్లు పై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్న విషయం తెలిసిందే. కేరళ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు ఈ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలే చేయమని భీష్మించుకు కూర్చున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ ఇప్పటి వరకు ఎపెక్స్ కోర్టులో 143 పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లు దాఖలు చేసిన వారిలో కాంగ్రెస్ నేత జైరాంరమేష్, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, కేరళ ప్రభుత్వంతో పలువురు ప్రముఖులు దాఖలు చేసిన పిటిషన్లు ఉన్నాయి. చట్టం రాజ్యాంగ చెల్లుబాటును వీరు ప్రశ్నిస్తూ క్షణం అమలును నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అలాగే పౌరసత్వ సవరణ చట్టంపై వివిధ హైకోర్టుల్లో పెండిం గ్ లో ఉన్న పిటిషన్లను కూడా ఎపెక్స్ కోర్టుకు బదిలీ చేయాలని కేంద్రం మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లు అన్నింటి పైనా చీఫ్ జస్టిస్ బాజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ ప్రారంభిస్తుంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/