టెలికాం సంస్థలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు టెలికాం సంస్థలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఏజీఆర్ ఛార్జీల కింద బకాయి పడ్డ రూ.వేల కోట్లను ఇంకా చెల్లించలేదని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల్ని ఎందుకు పాటించలేదంటూ కడిగి పారేసింది. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. సంస్థల నుంచి బకాయిలను రాబట్టడంలో విఫలైమన ప్రభుత్వంపైనా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏజీఆర్ ఛార్జీల కింద టెలికాం సంస్థలు ప్రభుత్వానికి రూ.92,000 కోట్లు చెల్లించాలని కోర్టు గతంలో ఆదేశించింది. ఇప్పటి వరకు బకాయిలు చెల్లించకపోవడంతో భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలికమ్యూనికేషన్స్ సహా మిగిలిన టెలికాం సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది.
ఈ సందర్భంగా ప్రభుత్వ టెలికాం విభాగంలోని డెస్క్ ఆఫీసర్పై న్యాయమూర్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును ప్రభావితం చేసేలా ఆదేశాలు జారీ చేసినందుకు న్యాయస్థానం మందలించింది. ఈ నాన్సెన్స్ పనులు ఎవరు చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. దేశంలో అసలు చట్టాలు లేకుండా పోయాయి. వారు ఈ దేశంలో జీవించడం కంటే విడిచివెళ్లడం మేలేమో అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏజీఆర్ ఛార్జీలను వసూలు చేయడంలో సంస్థలపై ఒత్తిడి తేవొద్దని డెస్క్ ఆఫీసర్ అధికారులకు లేఖ రాసినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. అలాగే ఎలాంటి చర్యలు కూడా తీసుకోవద్దని లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కోర్టు ఆఫీసర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/