చట్ట నిబంధనలకు లోబడి కూల్చివేతల ప్రక్రియ సాగాలి : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : వివిధ నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేసే విషయంలో తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నప్పుడు అధికారులు కచ్చితంగా చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది.
ఉత్తర్ప్రదేశ్లో ఇటీవల చెలరేగిన అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లను ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చివేస్తోంది. ఇది చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన అత్యున్నత ధర్మాసనం మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని యూపీ ప్రభుత్వాన్ని అదేశించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/