శబరిమల వివాదంపై సుప్రీం విచారణ వాయిదా

Supreme Court
Supreme Court

న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం సహా ఇతర ప్రార్థనా మందిరాల్లోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడింది. విచారణ చేపట్టాల్సిన అంశాలపై క్రోడీకరణ కోసం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. విచారణ అంశాలను తామే ఖరారు చేస్తామని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే స్పష్టం చేశారు. ఈ అంశంపై వాదనలు వినిపించేందుకు న్యాయవాదులకు సమయం చెబుతామని బోబ్డే నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. శబరిమలపై దాఖలైన రివ్యూ పిటిషన్లతో పాటు ఇతర ప్రార్థనా మందిరాల్లోకి మహిళల ప్రవేశం పైనా రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకోలేదని సిజేఐ వెల్లడించారు. అంతేకాకుండా మత విశ్వాసాలు, వాటిలో జోక్యం చేసుకునే విషయంలో న్యాయ పరిధిపై మాత్రమే విచారణ చేయనున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/