సుప్రీంకోర్టులో ఏపి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశం
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో జగన్ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనంటూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిమ్మగడ్డను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టులో ఈ కేసు ఉందని… సుప్రీం తీర్పు కోసం తాము వేచి చూస్తున్నామని వైఎస్ఆర్సిపి నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/