గాలి జనార్దన్రెడ్డి పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
అక్రమ మైనింగ్ కేసులో జనార్దన్ రెడ్డిపై అభియోగాలు

న్యూఢిల్లీః గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో తనకు బెయిల్ నిబంధనలు సడలించాలన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్రెడ్డి పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ట్రయల్ మొదలుపెట్టాలని హైదరాబాదు సీబీఐ కోర్టును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇకనుంచి రోజువారీ విచారణ చేపట్టాలని, 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. కాగా, గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో నెల రోజులే ఉండేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/movies/