ఏపీ హైకోర్టుకు ఏడుగురు జడ్జీలు .. సుప్రీం కొలీజియం సిఫార్సు

అమరావతి: ఏపీ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులకు కొలీజియం సిఫార్సు చేసింది. ఈనెల 29న సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్స్ చేసింది. ఏడుగురు న్యాయవాదులకు పదోన్నతి కల్పిస్తూ న్యాయమూర్తులుగా నియమించాలంటూ సిఫార్సు చేసింది. కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖర్‌రావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవితోపాటు వడ్డిబోయిన సుజాత పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/