గుడివాడ వెళ్తున్న నేత‌ల‌ను ఎందుకు అరెస్టు చేశారు?

ఏపీని అరాచ‌కాంధ్ర‌ప్ర‌దేశ్‌గా మార్చారు: సుజ‌నా చౌద‌రి

అమరావతి: వైస్సార్సీపీ నేత‌ల‌పై బీజేపీ నేత సుజ‌నా చౌద‌రి మండిప‌డ్డారు. కడప జిల్లాలో కేంద్ర మంత్రి మురళీధరన్ పర్యటించి సెంట్రల్ జైల్లో ఉన్న బీజేపీ నేత‌ శ్రీకాంత్‌రెడ్డిని పరామర్శించారు. అనంత‌రం ఆయ‌న వైస్సార్సీపీ నేత‌ల‌పై మండిప‌డ‌డంతో ఆయ‌న‌పై ప‌లువురు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సుజనా చౌద‌రి స్పందిస్తూ… మురళీధరన్ పరామ‌ర్శ‌ను కూడా ఏపీ హోం మంత్రి సుచ‌రిత వ్య‌తిరేకించ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని చెప్పారు.

శ్రీ‌కాంత్‌ రెడ్డిని 307 సెక్ష‌న్ కింద ఎలా అరెస్టు చేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. గుడివాడ వెళ్తున్న త‌మ పార్టీ నేత‌ల‌ను ఎందుకు అరెస్టు చేశార‌ని నిల‌దీశారు. ఏపీని వైస్సార్సీపీ అరాచ‌కాంధ్ర‌ప్ర‌దేశ్‌గా మార్చింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. కాగా, కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బీజేపీ నేత శ్రీకాంత్‌రెడ్డిని కడప కేంద్ర కారాగారంలో రిమాండు ఖైదీగా ఉన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/