సడెన్‌గా ఆగిన మెట్రో రైలు

రాయదుర్గం నుంచి నాగోల్‌ వెళ్తున్న మెట్రో రైలు టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ వల్ల ఆగింది

hyderabad metro rail
hyderabad metro rail

హైదరాబాద్‌: మెట్రో రైలు సడెన్‌గా నిలిచిపోవడంతో ప్రయణికులు తీవ్ర భయ బ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన ఆదివారం మెట్టుగూడ మెట్రో స్టేషన్‌లో జరిగింది. రాయదుర్గం నుంచి నాగోల్‌ వెళ్తున్న మెట్రో రైలు టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ వల్ల మెట్టుగూడా స్టేషన్లో నిలిచిపోయింది. ట్రైన్‌ రన్నింగ్‌లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయణీకులు తెలిపారు. వెంటనే మెట్రో సిబ్బంది ప్రయాణికులను అలర్టు చేసి మరో రైల్లో పంపారు. ఆగిపోయిన రైలును సిబ్బంది కొంచెం ముందుకు జరిపి అవతలి వైపు ట్రాక్‌ పై పెట్టడంతో లైన్‌ క్లియర్‌ అయ్యింది. దాదాపు 20 నిమిషాల పాటు ఆ రూట్‌లో వెళ్లే మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/