మరోసారి వంట గ్యాస్‌ ధర పెంపు

రాయితీ సిలిండర్‌పై రూ.50 పెంపు

Gas cylinders
Gas cylinders

న్యూఢిల్లీ: దేశంలో మరోసారి వంట గ్యాస్ రాయితీ సిలిండర్ ధర పెరిగింది. 15 రోజుల వ్యవధిలో సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. రాయితీ సిలిండర్‌పై రూ.50 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. పెంచిన ధరలతో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ రాయితీ సిలిండర్ ధర రూ.694కు చేరింది.

ఈ నెల 2కి ముందు హైదరాబాద్‌లో సిలిండర్‌ ధర రూ.646.50గా ఉండగా రాయితీ సిలిండర్ ధరను పెంచిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఇప్పటివరకు సిలిండర్ ధర రూ.696.5గా ఉంది. ఇప్పుడు మరో రూ.50 పెరగనుంది. ఢిల్లీలో రాయితీ సిలిండర్‌ ధర ఇంతవరకు ముందు రూ.644గా ఉంది. భారత్‌లోని ఒక్కో రాష్ట్రంలో ఎల్పీజీ ధరలు ఒక్కో రకంగా ఉంటాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/