నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
డీజీపీ మహేందర్రెడ్డి హెచ్చరిక
Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. . శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంగించిన వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉదయం 6 నుండి ఉదయం 10 గంటల లోగా నిత్యావసర వస్తువుల కొనుగోలు చేయాలని ,. ఉతయం 10 తర్వాత అనవసరంగా రోడ్ల మీదికి వస్తే వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు.
అంతర రాష్ట్ర సరిహద్దుల వద్ద లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తున్నా మని వివరించారు. మినహాయింపు వారు కాకుండా ఇతరులు రాకూడదని చెప్పారు.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/