లాభాలతో మొదలయిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 878.. నిఫ్టీ 197
ముంబయి: దేశంలో లాక్డౌన్ పొడగిస్తే కేంద్రం మరో ఆర్ధిక ప్యాకేజి ప్రకటిస్తుందన్న అంచనాలతో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 878 పాయింట్ల లాభంతో 30,612 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 197 పాయింట్లు లాభపడి 8,946 వద్ద ట్రేడ్ అవుతుంది. కాగా డాలరుతో రూపాయి మారకం విలువ 75.98 గా ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/