నష్టాలతో మొదలయిన స్టాక్మార్కెట్లు
లాక్డౌన్ పొడగించవచ్చన్న వార్తల ప్రభావం
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ నెల 14 తరువాత కూడా లాక్డౌన్ కొనసాగించవచ్చన్న వార్తలు సూచీలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో సెన్సెక్స్ 582 పాయింట్లు నష్టపోయి, 30,576 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 170 పాయింట్ల నష్టంతో 8,941 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.65 గా ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/