లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మూడు రోజుల వరుస నష్టాలకు ముగింపు పలికాయి. ఈరోజు మంచి లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత చివర్లో ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 503 పాయింట్లు లాభపడి 54,252కి పెరిగింది. నిఫ్టీ 144 పాయింట్లు పుంజుకుని 16,170కి ఎగబాకింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.57వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/