భారీ లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,345 పాయింట్లు లాభపడి 54,318కి చేరుకుంది. నిఫ్టీ 417 పాయింట్లు పెరిగి 16,259కి ఎగబాకింది. ఈ క్రమంలో ఈరోజు అన్ని సూచీలు లాభాలను మూటకట్టుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.54వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/