నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. వరసగా నాలుగో రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 214 పాయింట్లు కోల్పోయి 54,892కి పడిపోయింది. నిఫ్టీ 60 పాయింట్లు నష్టపోయి 16,356 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.77.74వద్ద కొనసాగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/