నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 617 పాయింట్లు నష్టపోయి 56,579కి పడిపోయింది. నిఫ్టీ 218 పాయింట్లు కోల్పోయి 16,953 వద్ద స్థిరపడింది. బ్యాంకెక్స్ మినహా అన్ని సూచీలు నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.67వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/