స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ 131.18… నిఫ్టీ 18.80
ముంబయి: దేశియ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా లాభపడ్డాయి. నేడు ఆర్బిఐ ప్రకటించిన రేట్ల కోత విషయం కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికి, ఈఎంఐలపై మూడు నెలలు మారటోరియం విదించడం నిరాశ కలిగించింది. దీంతో నేడు మదుపరుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 131.18 పాయింట్లు లాభపడి 29,815.59 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 18.80 పాయింట్లు లాభపడి 8,660 వద్ద స్థిరపడింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/