లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా లాభపడ్డాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 710 పాయింట్లు లాభపడి 61,764కి ఎగబాకింది. నిఫ్టీ 195 పాయింట్లు పుంజుకుని 18,264కి చేరుకుంది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.88 వద్ద కొనసాగుతుంది.