యుద్ధ ప్రభావం..కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

ముంబయి : ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించింది. రష్యన్ బలగాలు ఉక్రెయిన్ పై బాంబులతో విరుచుకుపడుతున్నాయి. ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా ఉంది. మన దేశీయ మార్కెట్లు కూడా కుప్పకూలాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 1,903 పాయింట్లు కోల్పోయి 55,370కి పడిపోయింది. నిఫ్టీ 547 పాయింట్లు కోల్పోయి 16,516కి దిగజారింది. అన్ని సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/