లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: రిలయన్స్ జియోలో ఫేస్ బుక్ భారీ పెట్టుబడి పెట్టడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 743 పాయింట్లు లాభపడి 31,380కి పెరిగింది. నిఫ్టీ 214 పాయింట్లు పుంజుకుని 9,196 వద్ద స్థిరపడింది. ఎనర్జీ సూచీ ఏకంగా 7.41 శాతం పెరిగింది.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/