స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 18.11 పాయింట్లు లాభపడి 61,981.79 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 33.60 పాయింట్లు లాభపడి 18,348.00 దగ్గర స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.81 వద్ద కొనసాగుతుంది.