భారీగా నష్టాపోయిన సెన్సెక్స్
కొనసాగుతున్న కరోనా భయాలు
మంబయి: కరోనా ప్రభావంతో స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈరోజు కూడా మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో, ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 2,713 పాయింట్లు నష్టపోయి 31,390కి పడిపోయింది. నిఫ్టీ 756 పాయింట్లు పతనమై 9,199 పాయింట్లకు దిగజారింది. అన్నింటి కన్నా ఎక్కువగా బ్యాంకింగ్ సూచీ 8.35 శాతం నష్టపోయింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/