భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతం రోజున భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,031.43 పాయింట్లు లాభపడి 58,991.52 వద్ద ముగిసింది. నిఫ్టీ 279.05 పాయింట్ల లాభంతో 17,359.75 దగ్గర స్థిరపడింది. మార్కెటు్ ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.22 వద్ద కొనసాగుతుంది.