స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమైనప్పటికీ ఉదయం 9.50 గంటల సమయంలో మాత్రం నష్టాల్లోకి జారుకున్నాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 14 పాయింట్లు దిగజారి 41,930 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ సూచీ 18 పాయింట్లు నష్టపోయి 12,333 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.92 వద్ద కొనసాగుతుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/