నష్టాల్లో మార్కెట్లు సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు అనంతరం ఒడిదుడుకులకు లోనయ్యాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 273 పాయింట్లు నష్టపోయి 52,578కి పడిపోయింది. నిఫ్టీ 78 పాయింట్లు కోల్పోయి 15,746 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.48 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/