నిలకడగా బులియన్‌ మార్కెట్‌

గతేడాది చివరల్లో పండుగలు కారణంగా డిమాండ్‌

GOLD PRICE
GOLD PRICE

ముంబై: బంగారం ధరలు సోమవారం స్థిరంగా ఉన్నాయి. గత వారంచివరి సెషన్లో రూ.500కుపైగా తగ్గిన పడిసి, సోమవారం అతి స్వల్పంగా పెరిగింది. వెండి త వారం రూ.1700కు పైగా తగ్గింది. గత 5 నెలల కాలంలో బంగారం రూ.8400వరకు తగ్గింది. ప్రపంచంలో బంగారం ఎక్కువగా వినియోగించే దేశాల్లో భారత్‌ రెండోస్థానంలో ఉంది.

ఏప్రిల్‌ నుంచి బంగారం డిమాండ్‌ పడిపోయినప్పటికీ, 2020 చివరల్లో దసరా, దీపావళి పండగు సీజన్‌కు తోడు, పెళ్లిళ్ల వంటి శుభకార్యాల వల్ల డిమాండ్‌ పెరిగింది. దీనికి తోడు క్రమంగా తగ్గడం కూడా కలిసి వచ్చింది. పండుగలు, శుభకార్యాల వల్ల బంగారానికి చివరల్లో డిమాండ్‌ పెరిగింది.

ఆగస్టు గరిష్టం తర్వాత పసిడి ధరలు అడపాదడపా పెరుగుతున్నప్పటికీ మొత్తానికి పడిపోతున్నాయి. సోమవారం ఉదయం సెషన్‌లో ఎంసిఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్‌ ఫ్యూచర్స్‌ రూ.53పెరిగి రూ.48,755వద్ద ట్రేడయింది. రూ.48,669వద్ద ప్రారంభమైన ధర రూ.48,780వద్ద గరిష్టానికి, రూ.48,608వద్ద కనిష్టానికిచేరింది. ఆల్‌టైమ్‌ గరిష్టంతో రూ.7450వరకు తగ్గింది

. ఏప్రిల్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ రూ.80 పెరిగి రూ.48,795వద్ద ఉంది. రూ.48,662వద్ద ప్రారంభమైన ధర రూ.48,795వద్ద గరిష్టానికి, రూ.48,626వద్ద కనిష్టానికిచేరింది.

సిల్వర్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ కూడా స్వల్పంగా పెరిగింది.కిలో సిల్వర్‌ ఫ్యూచర్స్‌ మార్చి 446పెరిగి రూ.65,210వద్ద ట్రేడయింది. రూ.65,055వద్ద ప్రారంభమై, రూ.65,265వద్ద గరిష్టానికి, రూ.64,880వద్ద కనిష్టానికిచేరింది. మే సిల్వర్‌ ఫ్యూచర్స్‌ కూడా తగ్గింది. రూ.509 పెరిగి రూ.66,125వద్ద ట్రేడయింది.

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరిగి 1832డాలర్ల వద్ద ట్రేడయింది. గోల్డ్‌ ఫ్యూచర్స్‌ ఔన్స్‌ 2.15డాలర్లు తగ్గి 1832.05డాలర్ల వద్ద ట్రేడయింది. నేటి సెషన్లో 1803.60-1832.40డాలర్ల మధ్య ట్రేడయింది. ఏడాదిలో పసిడి ధర 14.74శాతం పెరిగింది.

సిల్వర్‌ ఫ్యూచర్స్‌ కూడా పెరిగింది. ఔన్స్‌ ధర 0.67డాలర్లు తగ్గి 25.032డాలర్ల వద్ద ట్రేడయింది. సోమవారం ట్రేడింగ్‌లో 24.220-25.040డాలర్ల మధ్య ట్రేడయింది. ఏడాదిలో 35.42శాతం పెరిగింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/