జింఖానా గ్రౌండ్ ఘటన బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

జింఖానా గ్రౌండ్ ఘటన బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. భారత్ – ఆసీస్ T20 మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్ కు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు..అక్కడ జరిగిన తొక్కిసలాట లో చాలామంది గాయపడ్డారు. ఈ ఘటన పట్ల తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయినా సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటన బాధితులకు అండగా ఉంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హామీ ఇచ్చారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. కాగా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాసేపట్లో బాధితులతో కలిసి ఉప్పల్ స్టేడియంకు వెళ్లనున్నారు. వారితో కలిసి మ్యాచ్ తిలకించనున్నారు.

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో నేడు హైదరాబాద్ లో నిర్ణయాత్మక మ్యాచ్ జరగనుంది. దాంతో ఈ మ్యాచ్ కు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. ఉప్పల్ మ్యాచ్‌కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 2500 మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. 300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించనున్నారు. గత అనుభవాలతో ఎయిర్‌పోర్టు నుంచి ఆటగాళ్లు స్టేడియం చేరుకునే వరకూ పోలీసులు కట్టదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సీసీ కెమోరాలను కమాండ్‌ కంట్రోల్‌ రూంతో అనుసంధానం చేసి ప్రతి ఒక్క వ్యక్తి కదలికలను క్షుణ్నంగా పరిశీలించనున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా స్టేడియం వద్ద ఫైర్‌, వైద్య ఆరోగ్య సిబ్బంది సేవలు అందించనున్నారు. ఏడు అంబులెన్సులను కూడా సిద్ధంగా ఉంచారు. అవాంచనీయ సంఘటనలు, ప్రమాదాలు సంభవిస్తే అంబులెన్స్‌ల్లో సమీపంలోని ఆసుపత్రులకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. మూడేళ్ల తరువాత నగరంలో మ్యాచ్‌ జరుగుతుండటంతో పాటు అదివారం కూడా కావడంతో ఈ మ్యాచ్‌కి ప్రాధాన్యత ఏర్పడింది.