ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కాంగ్రెస్ లేదు

పాలమూరు దరిద్రానికి కాంగ్రెస్ పార్టీనే కారణం..మంత్రి శ్రీనివాస్‌గౌడ్

Srinivas goud

హైదరాబాద్‌: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కాంగ్రెస్‌ పై మండిపడ్డారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదని అన్నారు. పాలమూరు దరిద్రానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని అన్నారు. పాలమూరు ప్రజలు తాగునీటికి కూడా ఇబ్బంది పడుతున్నారని… దీనికంతా కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంటే కాంగ్రెస్ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని… అందుకే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలనుకుంటే… ప్రజల్లో వారే చులకన అవుతారని అన్నారు. గత ముఖ్యమంత్రులు ఈ ప్రాంతానికి ఒరగబెట్టింది ఏమీ లేదని విమర్శించారు. ఎల్లూరు ప్రాజెక్టులో పైపుల మునక సాంకేతిక లోపం అయ్యుండొచ్చని చెప్పారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/