శ్రీదేవి శోభన్‌బాబు ట్రైలర్ విడుదల

పేపర్ బాయ్, మంచి రోజులు వచ్చాయి, ఏక్ మినీ కథ లాంటి వైవిధ్య భరితమైన చిత్రాలతో విజయాలు అందుకున్న హీరో సంతోష్ శోభన్.. తాజాగా శ్రీదేవి శోభన్‌బాబు మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఆ మధ్య సమంత టీజర్‌ రిలీజ్‌ చేయగా తాజాగా చిరంజీవి ఆచార్య ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ట్రైలర్‌ విడుదల చేశారు.

‘నమస్కారం, మరికొన్ని విశేషాలతో మీ ముందుకు వచ్చాం, కథలో ముఖ్యాంశాలు.. హీరోకు నోటివాటం ఎక్కువ, హీరోయిన్‌కు చేతివాటం ఎక్కువ, వీరి మధ్య ఒక చాలెంజ్‌..’ అంటూ ట్రైలర్‌ మొదలైంది. ‘ఇక్కడ మాటలతో నెగ్గం బాబాయ్‌, మూటలుంటేనే నెగ్గుతాం’ వంటి డైలాగులు ఆకట్టుకున్నాయి. ట్రైలర్ మొత్తం కూడా మంచి కామెడీ ఎంటర్టైనర్ గా ఉంది. ఈ సినిమాలో నాగబాబు, రోహిణి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ మూవీ లో గౌరీ జి. కిషన్‌ హీరోయిన్‌గా నటించింది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర యూనిట్ తెలిపారు.

YouTube video