కంటెంట్ లేదంటూ డైరెక్టర్ పూరి ఫై శ్రీ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మరోసారి శ్రీ రెడ్డి లైగర్ మూవీ ఫై , డైరెక్టర్ పూరి జగన్నాద్ ఫై విమర్శలు చేసింది. గత వారం రోజులుగా చిత్రసీమలో ఎక్కడ చూసిన లైగర్ గురించే మాట్లాడుకుంటున్నారు. పూరి – విజయ్ దేవరకొండ కలయికలో సినిమా అనగానే అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరాయి. బాక్సింగ్ నేపథ్యంలో కథ..మైక్ టైసన్ నటించడం..పాన్ ఇండియా గా విడుదల కావడం తో అభిమానులు సినిమా ఫై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ ఆ ఆశలపై పూరి నీళ్లు చల్లాడు. మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొని..థియేటర్స్ నుండి వెళ్లేందుకు సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా ఏడో రోజు కోటి కూడా వసూళ్లు చేయలేకపోయిందంటే సినిమా ఎంత డిజాస్టర్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈ చిత్రం ఫై…సినిమా రిలీజ్ కు ముందు చిత్ర యూనిట్ చేసిన హంగామా ఫై పలువురు విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ఈ తరుణంలో శ్రీ రెడ్డి కూడా తన నోటికి పనిచెప్పింది. ఈ సినిమాలో అసలు కంటెంటే లేదని… కంటెంట్ లేని సినిమాకు ఇంత హైప్ అవసరమా? అని ఎద్దేవా చేసింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ పై శ్రీరెడ్డి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తీసేవన్నీ ఫ్లాప్ సినిమాలేనని… అయినా, మహేశ్ బాబు డేట్స్ ఇవ్వడం లేదని చెప్పడం ఏంటో అని విమర్శించింది. మహేశ్ డేట్స్ ఇవ్వలేదని ఏడవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది. ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోపక్క దర్శకుడు తమ్మారెడ్డి సైతం సినిమా ఫై పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది.