భద్రాద్రి రామయ్యకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి

భద్రాచలంలో సీతారాములవారి కల్యాణోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసుకొచ్చారు. ఉదయం 10.30 నుంచి కల్యాణ తంతు ప్రారంభం అయింది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్న సుమూహుర్తాన కల్యాణ మహోత్సవం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.

స్వామివారి కల్యాణ వేడుకకు హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, హైకోర్టు న్యాయమూర్తి నవీన్‌ రావు, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ తాతా మధు హాజరయ్యారు. కల్యాణానికి వచ్చే భక్తులతో భద్రాద్రి కిక్కిరిసి పోయింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. వేలాదిమంది కూర్చిని వీక్షించేలా చలువ పందిర్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఎండ తీవ్రతను తట్టుకునేలా ఫ్రీగా మంచి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపినీ చేస్తున్నారు అధికారులు.