శ్రీలంక పార్లమెంటు రద్దు
ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ..అధ్యక్షుడి సంచలన నిర్ణయం

కొలంబో: శ్రీలంక పార్లమెంట్ రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రకటించారు. సోమవారం అర్ధరాత్రి నుండి ఇది అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం ఉండగానే అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ ఏడాది ఆగస్టులో దేశంలో ఎన్నికలు జరగాల్సి ఉండగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంతో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 25న ఎన్నికలు జరుగుతాయని ప్రకటించిన అధ్యక్షుడు.. మార్చి 12 నుంచి 19వ తేదీ లోపు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేసుకోవచ్చని తెలిపారు. 2015 నుంచి 2019 వరకు ప్రధానిగా పనిచేసిన రణిల్ విక్రమ సింఘేపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనను పదవి నుంచి తొలగించిన అధ్యక్షుడు రాజపక్స.. తన తమ్ముడైన మహీంద రాజపక్సేను ఆపద్ధర్మ ప్రధానిగా నియమించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/